టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. మరో భారత క్రికెటర్ ఇషాంత్ శర్మతో పాటు అతని భార్య ప్రతిమా సింగ్ కూడా కరోనా టీకా తీసుకున్నారు. గత వారం ఉమేష్ యాదవ్, ఆజింక్య రహానె, శిఖర్ ధావన్ టీకా తొలి డోస్ను తీసుకున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం జూన్ 2న ఇంగ్లాండ్కు వెళ్లనుంది భారత జట్టు. ఆ సమయానికి ఆటగాళ్లందరూ తొలి డోస్ టీకా తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, రెండో డోస్పై సందిగ్ధం నెలకొంది.