ముంబయి: వెస్టిండీస్తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్కు సెలక్షన్ కమిటీ బుధవారం భారత జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రాజస్థాన్ హార్డ్ హిట్టర్ దీపక్ హుడాకు వన్డే పిలుపు అందింది. దక్షిణాఫ్రికాలో స్పిన్నర్ల వైఫల్యం నేపథ్యంలో 21 ఏళ్ల లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. స్పిన్నర్ కుల్దీప్ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు.
మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడం వల్ల ఆల్రౌండర్ జడేజా సెలక్షన్కు అందుబాటులో లేడు. హార్దిక్ పాండ్య కూడా ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. ఫాస్ట్బౌలర్లు బుమ్రా, షమిలకు విశ్రాంతి కల్పించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉంటాడు. భువనేశ్వర్కు టీ20 జట్టులో మాత్రమే స్థానం లభించింది. అశ్విన్ ఏ జట్టులోనూ లేడు.
వెస్టిండీస్తో వన్డేలు ఫిబ్రవరి 6, 9, 11న అహ్మదాబాద్లో.. టీ20లు ఫిబ్రవరి 16, 18, 20న కోల్కతాలో జరుగుతాయి.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్, ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్, దీపక్ హుడా, పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్