IND VS SL First test: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమ్ఇండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 174 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా లంక 400పరుగుల వెనుకంజలో ఉంది. కాగా, శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యాక.. టీమ్ఇండియా ఫాలో- ఆన్ ఇచ్చింది. దీంతో శ్రీలంక జట్టే మళ్లీ బ్యాటింగ్కు దిగింది.
మూడు రోజు ఆటలో భాగంగా తొలి సెషన్లో భారత బౌలర్లు అదరగొట్టారు. జడేజా ఐదు వికెట్లు తీశాడు. నిస్సంక (61*) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.
ఆదివారం ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మరో 66 పరుగులు జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఓవర్నైట్ బ్యాటర్లు అసలంక, నిస్సంక తొలి గంట సేపు జాగ్రత్తగా ఆడారు. అయితే, ఈ జోడీని బుమ్రా విడదీశాడు. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద అసలంకను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడం వల్ల లంక సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత బౌలర్లు చెలరేగి 13 పరుగుల తేడాతో మిగిలిన ఐదు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే జడేజా ఐదు వికెట్ల ఘనత సాధించాడు. బుమ్రా, అశ్విన్ తలో రెండు వికెట్లు తీయగా.. షమీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 400 పరుగుల సంపూర్ణ ఆధిక్యం లభించింది.