తెలంగాణ

telangana

By

Published : Aug 15, 2021, 5:38 PM IST

ETV Bharat / sports

టీమ్​ఇండియా టపటప.. లంచ్​ సమయానికి 56/3

లార్డ్స్​ టెస్టు​లో భారత బ్యాట్స్​మెన్​ తడబడుతున్నారు. రెండో ఇన్నింగ్స్​లో ఆచితూచి ఆడుతున్నారు. అయినప్పటికీ మూడు వికెట్లు కోల్పోయారు.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్

లార్డ్స్​ టెస్టు నాలుగోరోజు భోజన విరామానికి టీమ్ఇండియా మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. కెప్టెన్ రహానె (1*), పుజారా (3*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో మార్క్​ వుడ్​ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం 29 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీ సేన.

నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్​ను పేలవంగా ఆరంభించింది టీమ్ఇండియా. తొలి వికెట్​కు ఈ జోడీ 18 పరుగులు నమోదు చేశాక.. మార్క్​ వుడ్​ ఈ జంటను విడదీశాడు. అనంతరం కొద్దిసేపటికే మరో ఓపెనర్​ రోహిత్​ కూడా అతడి బౌలింగ్​లోనే వెనుదిరిగాడు. 20 పరుగులు చేసి టచ్​లోకి వచ్చినట్లు కనిపించిన సారథి కోహ్లీని సామ్​ కరన్​ వెనక్కి పంపాడు.

అంతకుముందు, నాలుగో రోజు ఆటను టీమ్ఇండియా మహిళ ఆల్​రౌండర్​ దీప్తి శర్మ గంటను కొట్టి ప్రారంభించింది. ప్రతి రోజు ఒక్కొక్కరు గంట కట్టి ఆటను ప్రారంభిస్తున్నారు. అంతకు ముందు మూడోరోజు ఫరూక్​ ఇంజినీర్​ ఆటను ప్రారంభించాడు.

ABOUT THE AUTHOR

...view details