తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS BAN: టీమ్​ఇండియా ఆలౌట్​.. రాణించిన పుజారా, శ్రేయస్​

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. ఆ వివరాలు..

By

Published : Dec 15, 2022, 1:29 PM IST

Updated : Dec 15, 2022, 2:50 PM IST

IND VS BAN first test teamindia 404 runs all out
టీమ్​ఇండియా ఆలౌట్​.. రాణించిన పుజారా, శ్రేయస్​

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. 278 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్​ అదనంగా మరో 126 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో పుజారా(90*), శ్రేయస్‌ అయ్యర్‌(86), అశ్విన్‌(58) పరుగులతో రాణించారు.

ఆఖరిలో కుల్దీప్‌ యాదవ్‌(40) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా స్టాండింగ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(22), శుబ్‌మాన్‌ గిల్‌(20), విరాట్‌ కోహ్లి(1) తీవ్ర నిరాశపరిచారు. ఇక బంగ్లాదేశ్‌ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, ఖలీల్‌ ఆహ్మద్‌ తలా వికెట్‌ సాధించారు.

ఇదీ చూడండి:కివీస్​ జట్టుకు బిగ్​ షాక్​.. కేన్‌ విలియమ్సన్‌ సంచలన నిర్ణయం

Last Updated : Dec 15, 2022, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details