ind vs Aus Final World Cup 2023 :2023 వరల్డ్కప్ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఫైనల్లో తలపడే జట్లేవో కూడా తెలిసిపోయింది. టైటిల్ పోరులో భారత్ - అస్ట్రేలియా నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా అమీతుమి తేల్చుకోనున్నాయి. విశ్వకప్ విజేతగా నిలిచేందుకు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాయి. ఆతిథ్య భారత్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి కాగా.. ఆసీస్ ఎనిమిదో ఫైనల్ ఆడనుంది. అయితే ఐసీసీ ఈవెంట్ నాకౌట్ మ్యాచ్ల్లో ఇరుజట్లు 7 సార్లు తలపడగా.. భారత్దే పైచేయి. కానీ, ఆసీస్ నమోదు చేసిన మూడు విజయాలను టీమ్ఇండియా ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతలా ప్రభావం చూపిన ఆ మూడు విజయాలేవంటే?
అప్పుడు భంగపడ్డ భారత్..సరిగ్గా 20 ఏళ్ల కింద, 2003 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు ఆసీస్ కెప్టెన్గా రికీ పాంటింగ్ ఉండగా.. సౌరభ్ గంగూలీ భారత్కు నాయకత్వం వహించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. భారత్ ముంగిట 360 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్.. 39.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటై, రన్నరప్తో సరిపెట్టుకుంది.
2015లో ఇలా.. 2015 ప్రపంచకప్లో అత్యంత సక్సెస్ఫుల్ జట్టుగా నిలిచిన భారత్.. క్వార్టర్స్లో బంగ్లాదేశ్ను ఓడించి భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. కానీ, సెమీస్లో ఆసీస్ను ఢీకొట్టిన భారత్.. అనూహ్యంగా ఓడి ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్లో 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్.. 233 పరుగులకు ఆలౌటైంది. ఈ ఎడిషన్ ట్రోఫీని ఆసీస్ గెలిచింది.
2023లోనూ తప్పని ఓటమి.. ఇదే ఏడాది జూన్లో జరిగిన.. 2021-23 వరల్డ్టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. ఈ మ్యాచ్లోనూ ఆసీస్ చేతిలో భారత్కు పరాభవం తప్పలేదు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్లో వరుసగా (469, 270-8) నమోదు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైన భారత్.. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఛేదనలో టీమ్ఇండియా 234 పరుగులకే పరిమితమైంది. దీంతో 203 పరుగుల తేడాతో నెగ్గిన ఆసీస్.. టెస్టు ఛాంపియన్షిప్ గథ ఎగరేసుకుపోయింది.