తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఫైనల్ మ్యాచ్​లు ఇంగ్లాండ్​లో పెట్టొద్దు బాబోయ్​' - డబ్ల్యూటీసీ మ్యాచ్​పై కెవిన్ పీటర్సన్

అతి ముఖ్యమైన మ్యాచ్​ల వేదికగా యూకే కంటే దుబాయే నయమని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. అక్కడ వాతవరణ సమస్యలు కూడా ఉండవని తెలిపాడు. యూకేలో వాతవరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదని పేర్కొన్నాడు.

wtc final, kevin pietersen
డబ్ల్యూటీసీ మ్యాచ్​, కెవిన్ పీటర్సన్

By

Published : Jun 21, 2021, 8:26 PM IST

Updated : Jun 21, 2021, 8:38 PM IST

ఏకైక, అతి ముఖ్యమైన మ్యాచ్​ల వేదికగా రాబోయే రోజుల్లో యూకే​ను ఎంపిక చేయొద్దని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen)​ అభిప్రాయపడ్డాడు. లండన్​లో వాతవరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలీదని తెలిపాడు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్(WTC final)​ మ్యాచ్​యే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నాడు.

ఇండియా-న్యూజిలాండ్(India Newzeland WTC final) మధ్య జరుగుతోన్న ఈ మ్యాచ్​లో.. ఇప్పటికే రెండు రోజుల ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగు రోజుల ఆటలో 360 ఓవర్లకు గానూ కేవలం 140 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

"ఇలా చెప్పడానికి బాధగా ఉంది. కానీ, ఏకైక, ప్రాముఖ్యత కలిగిన క్రికెట్ మ్యాచ్​లకు వేదికగా యూకేను ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేయొద్దు. డబ్ల్యూటీసీ ఫైనల్​ వంటి ఏకైక మ్యాచ్​ ఉన్న టోర్నీలను దుబాయ్​ వేదికగా నిర్వహించడం సరైన పని. అక్కడైతే తటస్థ వేదిక. మంచి స్టేడియం. వాతవరణంతో ఇబ్బంది ఉండదు. మంచి శిక్షణ సదుపాయాలు. ప్రయాణాలకు కూడా వీలుగా ఉంటుంది."

-కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.

ఇలాంటి పెద్ద టోర్నీని దుబాయ్​ లాంటి దేశాలలో నిర్వహించాలని కెవిన్ తెలిపాడు. అక్కడ వాతవరణ సంబంధిత అంతరాయాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:WTC Final: నాలుగో రోజూ వరుణుడిదే

Last Updated : Jun 21, 2021, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details