తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ఇదే.. టీమ్​ఇండియా నుంచి ముగ్గురు.. ఎవరంటే? - ఐసీసీ 2022 టీ20 టీమ్​

2022 సంవత్సరానికిగానూ తమ అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది ఐసీసీ. ఈ జాబితాలో టీమ్​ఇండియా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు.

ICC Rankings
ICC Rankings: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ఇదే.. లిస్ట్​లో కోహ్లీ, సూర్య

By

Published : Jan 23, 2023, 5:01 PM IST

ఐసీసీ.. 2022 సంవత్సరానికిగానూ తమ అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. గతేడాది టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుని 11 మంది ఆటగాళ్ల పేర్లను తెలిపింది. ఇందులో ముగ్గురు టీమ్‌ఇండియా ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఈ జాబితాలో ఉన్నారు.

ఐసీసీ టీ20 జట్టు 2022.. జోస్‌ బట్లర్‌ (కెప్టెన్, ఇంగ్లాండ్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్), విరాట్ కోహ్లీ (భారత్‌) , సూర్యకుమార్‌ యాదవ్ (భారత్‌)‌, గ్లెన్ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌, సికిందర్‌ రజా (జింబాబ్వే), హార్దిక్‌ పాండ్య (భారత్), సామ్ కరన్ (ఇంగ్లాండ్‌)‌, వానిందు హసరంగ (శ్రీలంక), హారిస్ రవూఫ్‌ (పాకిస్థాన్‌), జోష్‌ లిటిల్ (ఐర్లాండ్)‌.

మహిళల క్రికెట్‌కు సంబంధించిన టీ20 జట్టును కూడా ఐసీసీ ప్రకటించింది. దీంట్లో టీమ్‌ఇండియా నుంచి స్మృతి మంధాన, దీప్తి శర్మ, రిచా ఘోష్‌లకు చోటు దక్కింది. ఇంకా సోఫీ డివైన్ (కెప్టెన్‌,న్యూజిలాండ్),స్మృతి మంధాన (భారత్‌), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), యాష్ గార్డనర్ (ఆస్ట్రేలియా), తహిలా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్తాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (భారత్‌), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్), ఇనోకా రణవీర (శ్రీలంక) కూడా ఉన్నారు.

ఇదీ చూడండి:Wrestling Protest: మేరీ కోమ్​ నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పాటు.. WFI అధ్యక్షుడిపై విచారణకు..

ABOUT THE AUTHOR

...view details