తెలంగాణ

telangana

ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనల్​ ఒకే మ్యాచ్​​.. ఐసీసీ వివరణ

డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final)​ మ్యాచ్​ను ఒక్క టెస్టు మ్యాచ్​గా ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో స్పష్టతనిచ్చింది ఐసీసీ(Icc). అంతర్జాతీయ క్యాలెండర్ రద్దీ కారణంగా ఇంతకు మించి మ్యాచ్​ల నిర్వహణ సాధ్యం కాదని వెల్లడించింది.

By

Published : Jun 14, 2021, 10:36 PM IST

wtc final, icc
డబ్ల్యూటీసీ ఫైనల్, ఐసీసీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ (WTC Final)​ను మూడు టెస్టులుగా నిర్వహించాలని పలువురు క్రికెటర్లు ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో ఐసీసీ(ICC) స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్​ షెడ్యూల్​ బిజీగా ఉన్నందున అందుకు వీలుపడదని వెల్లడించింది. 'ఆదర్శనీయమైన ప్రపంచం'లో మాత్రమే అది సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.

"డబ్ల్యూటీసీ ఫైనల్​ను మూడు టెస్టులుగా నిర్వహించాల్సి వస్తే క్రికెట్​ ఆడే దేశాలన్నీ ఒక నెల రోజుల ఖాళీ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుత రద్దీ షెడ్యూల్​ సమయంలో అది సాధ్యం కాదు. అందుకే ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్​ మ్యాచ్​ను ఒకే టెస్టుగా నిర్వహిస్తున్నాం."

-జియోఫ్ అలార్డిస్​, ఐసీసీ తాత్కాలిక సీఈఓ.

డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం ప్రవేశపెట్టిన అర్హత విధానంపై సంతోషం వ్యక్తం చేశారు అలార్డిస్(Geoff Allardice). "కరోనా కారణంగా మధ్యలో పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చాం. దీనిపై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. కొన్ని జట్లు రెండు మ్యాచ్​ల టెస్టు​ సిరీస్ ఆడాయి. మరికొన్ని జట్లు ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లు ఆడుతుంటాయని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందులో పెద్ద తేడా అనేది ఏమీ ఉండదు" అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'ఆ విషయంలోకి సెలెక్టర్లను అనవసరంగా లాగారు'

ABOUT THE AUTHOR

...view details