తెలంగాణ

telangana

Yuvraj Singh: మాజీ క్రికెటర్ యువీకి హైకోర్టు హెచ్చరికలు

By

Published : Aug 28, 2021, 1:23 PM IST

మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్ (Yuvraj Singh), తనపై పెట్టిన కేసులో సహకరించకుంటే అతడిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని పంజాబ్-హరియాణా న్యాయస్థానం హెచ్చరించింది. గతంలో ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ గతేడాది యువీపై సామాజిక కార్యకర్త రజత్​ కల్సన్ కేసు పెట్టారు. ​

Yuvraj Singh
యువరాజ్​ సింగ్

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​కు (Yuvraj Singh) సంబంధించిన ఓ కేసుపై.. పంజాబ్​-హరియాణా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆధారాలను తిరిగి సమర్పించాలనుకుంటున్నట్లు యువీ తరఫు న్యాయవాది పునీత్​ బాలి తెలిపారు. అయితే ఇప్పటికే చాలా సమయమిచ్చినట్లు.. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది అర్జున్​ షియోరాన్ పేర్కొన్నారు.

ఈ కేసుపై స్పందించిన హైకోర్టు బెంచ్.. 'దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని​.. యువరాజ్​ పేరును చేర్చారా? లేదా?' అని పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ను (పీపీ) ప్రశ్నించింది. 'ఒక్కసారి మాత్రమే యువరాజ్​ సింగ్​ దర్యాప్తులో చేరారని.. కానీ అతడి నుంచి ఎలాంటి సహకారం లభించలేదని.. అతడి మొబైల్​ను ఇవ్వడానికి నిరాకరించాడని' పీపీ పేర్కొన్నారు. 'యువరాజ్​ దర్యాప్తునకు సహకరించకుంటే అతడిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని' కోర్టు హెచ్చరించింది. ఈ విషయాన్ని పిటిషనర్​ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది.

'యువరాజ్​ ప్రస్తుతం దుబాయ్​లో ఉన్నాడని' న్యాయవాది పునీత్​ బాలి బదులిచ్చారు. 'అక్కడినుంచి రాగానే అతడిని దర్యాప్తులో భాగం చేయనున్నట్లు' వెల్లడించారు. తదుపరి విచారణను సెప్టెంబర్​ 6కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు బెంచ్​ తెలిపింది. ఏవైనా ఆధారాలు సమర్పించాలనుకుంటే.. ఈ గడువు లోపు చేయాలని ఆదేశించింది.

ఓ వర్గంపై యువీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని.. సామాజిక కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సన్ ఆరోపిస్తూ, హరియాణాలోని హన్సీ గ్రామంలో పోలీసు కేసు పెట్టారు. తనపై కేసును కొట్టివేయాలంటూ యువీ హైకోర్టులో పిటిషన్ వేశాడు.

ఇదీ చదవండి:Ashish Nehra: 'గతంలో ఇలా ఆడలేదు.. కొత్త పుజారాను చూస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details