తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒక్కో ఫార్మాట్​కు ఒక్కో కోచ్​.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు - హర్భజన్ సింగ్ లేటెస్ట్ న్యూస్​

టీమ్‌ఇండియాకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ ఉంటే బాగుంటుంది అనే చర్చ గత కొద్ది రోజుల నుంచి నడుస్తోంది. తాజాగా ఈ విషయమై మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మాట్లాడాడు. ఏం అన్నాడంటే..

Harbhajan singh three formats three coaches
ఒక్కో ఫార్మాట్​కు ఒక్కో కోచ్​.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

By

Published : Nov 24, 2022, 6:42 PM IST

టీమ్‌ఇండియాకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ ఉంటే బాగుంటుంది అనే చర్చ గత కొద్ది రోజుల నుంచి నడుస్తోంది. తాజాగా ఈ విషయమై మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. ఆ చర్చను సమర్థించేలా మాట్లాడాడు. టీమ్‌ఇండియా టీ20 కోచ్‌గా పేస్‌ దిగ్గజం ఆశిశ్‌ నెహ్రా అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను తక్కువగా అంచనా వేయలేమని అన్నాడు. ఎంతోకాలం ద్రవిడ్‌తో పని చేసిన తనకు... ద్రవిడ్‌ గురించి తెలుసని, ఆటపై అతనికున్న అవగాహన గురించి తెలుసని భజ్జీ చెప్పాడు. అయితే ఇంగ్లాండ్‌ జట్టు కూడా ఇదే తరహాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే.

వారిద్దరు కలిస్తే.. "టీ20లు కాస్త భిన్నమైనవని.. ఈ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించిన ఆశిశ్‌ లాంటి వారైతే 2024 ప్రపంచకప్‌నకు మన జట్టును మరింత మెరుగ్గా సన్నద్ధం కావచ్చు. అలాగని ద్రవిడ్‌ను పక్కన పెట్టాలని నేను చెప్పను. ఆశిశ్‌, రాహుల్‌ కలసి పనిచేస్తే 2024 ప్రపంచకప్‌ సమయానికి జట్టును మరింత మెరుగ్గా నిర్మించవచ్చు. న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో ద్రవిడ్‌కు విశ్రాంతినిచ్చారు. అలాంటప్పుడు మరో కోచ్‌ ఉంటే ఆ బాధ్యతలను చూసుకొంటాడుఫార్మాట్‌ను బట్టి ఆటగాళ్లను మార్చాలి" అని హర్భజన్‌ అన్నాడు.

టీ20లను అలానే ఆడాలి.. "టీ20 ఫార్మాట్‌లో అవలంబిస్తోన్న పద్ధతి మారాలి. మొదటి 6 ఓవర్లు ఎంతో కీలకం. అది కుదరకపోతే హార్దిక్‌ పాండ్యా, సూర్య కుమార్‌ లాంటి ఆటగాళ్లపై ఆశలు పెట్టుకోవాల్సి వస్తుంది. వారు కూడా రాణించలేకపోతే ఇక స్కోర్‌ పూర్తి చేయకుండానే వెనుదిరగాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇంగ్లాండ్‌ తన విధానం మార్చుకోవడం వల్లనే వారు రెండు ప్రపంచకప్‌లను సాధించగలిగారు. అందుకే టీ20లను టీ20ల్లాగే ఆడాలి. వన్డేల్లా కాదు" అని సూచించాడు భజ్జీ.

అది పెంచుకోవాలి.. "టీమ్‌ఇండియాలో టాప్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌.. స్ట్రైక్‌ రేట్‌పై మరింత దృష్టి సారించాలి. మొదటి 10-12 ఓవర్లలో కనీసం ఓవర్‌కు 9 పరుగుల చొప్పున చేయాలి. రోహిత్‌, కోహ్లీ.. టీ20ల్లో ఆడతారా లేదా అనే విషయంపై నేను స్పందించలేను. వాళ్లు నాణ్యమైన ఆటగాళ్లు. ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ఆడతారు. రోహిత్‌ తర్వాత టీ20లకు కెప్టెన్‌గా ఎవరుంటారనే ప్రశ్నకు నేనైతే హార్దిక్‌ అనే చెబుతా" అని హర్భజన్‌ చెప్పాడు.

ఇదీ చూడండి:Harihara Veeramallu: ​భారీ సెట్​లో 900 మందితో పవన్​పై షూటింగ్

ABOUT THE AUTHOR

...view details