Goutham Gambhir: భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఓ క్రికెట్ జట్టుతో గొడవ పడినందుకు రెండు నెలల పాటు పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆ వివాదం వల్ల ప్రధానోపాధ్యాయుడు కన్నీరుపెట్టుకున్నాడని చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అతడు ఈ విషయాల్ని పంచుకున్నాడు.
"ఐటీఎస్సీ పోటీల్లో పాల్గొనడానికి 'ఒమన్ హౌజ్'కు వెళ్లాం. అక్కడ రెండు జట్ల సభ్యులు షూలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మేం గొడవపడి హౌజ్లోని ఓ చిత్రపటాన్ని పగలగొట్టాం. ఒమన్ నుంచి తెచ్చిన ఆ చిత్రపటాన్ని చూసి అక్కడి ప్రధానోపాధ్యాయుడు కన్నీరు పెట్టుకున్నాడు."
-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్