తెలంగాణ

telangana

'సచిన్​తో ప్రాంక్​.. అప్పుడే నన్ను చంపేస్తారనుకున్నా!'

By

Published : Aug 11, 2021, 4:51 PM IST

దిగ్గజ సచిన్​తో తాను గతంలో చేసిన ప్రాంక్​​.. ఫెయిలైందని, దాంతో సచిన్ అభిమానులు తనను చంపేస్తారని అనుకున్నట్లు వెల్లడించాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్​. ఏమైంది?

Shoaib Akhtar reflects on a failed prank with Sachin Tendulkar
సచిన్​ అక్తర్​ గొడవ​

రాజకీయ ఉద్రిక్తతల కారణంగా.. భారత్​- పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్​ జరగక దశాబ్దం దాటిపోయింది. చివరిసారి 5 వన్డేలు, 3 టెస్టుల ఆడేందుకు​ 2007లో పాకిస్థాన్, భారత పర్యటనకు వచ్చింది. అదే టూర్​లో.. సచిన్​ తెందుల్కర్​తో జరిగిన ఓ సరదా సన్నివేశం గురించి ఇప్పుడు చెప్పాడు పాకిస్థాన్​ మాజీ బౌలర్​, రావల్పిండి ఎక్స్​ప్రెస్​ షోయబ్​ అక్తర్​. అయితే అవార్డుల కార్యక్రమంలో సచిన్​తో ప్రాంక్​​ చేసిన అక్తర్​కు​ దిమ్మతిరిగిపోయిందట. ఆ పని వల్ల తనకు భారత్​ వీసా రాకపోయేదని, భారతీయులు చంపేసేవారని అనుకున్నట్లు తాజాగా గుర్తు చేసుకున్నాడు. సచిన్​ను కిందపడేయడమే దీనికి కారణం. ఇంతకీ ఏం జరిగిందో.. అక్తర్​ మాటల్లోనే..

షోయబ్​ అక్తర్​

''పాకిస్థాన్​ తర్వాత.. నేను ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకుంది ఇండియా నుంచే. భారత పర్యటనల్లో నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. 2007 పర్యటన సందర్భంగా.. అవార్డుల కార్యక్రమంలో ఏదో విభిన్నంగా చేయాలనుకుని సచిన్​ను ఎత్తుకోవాలనుకున్నా.

ఎలాగోలా సచిన్​ను ఎత్తుకున్నా .. కానీ అతడు నా చేతుల్లోంచి జారిపోయాడు. సచిన్​ కిందపడిపోయాక.. నేను చనిపోయాన్రా అనుకున్నా. సచిన్​కు ఒకవేళ గాయమైతే.. నాకు ఇక భారత్​ వీసా రాదని భయపడిపోయా. అభిమానులు నన్ను మళ్లీ భారత్​కు రానిచ్చేవారు కాదు లేదా సజీవదహనం చేసేవారనుకున్నా''

- షోయబ్​ అక్తర్​, పాక్​ మాజీ క్రికెటర్​

పాకిస్థాన్​ తరఫున 46 టెస్టులాడిన అక్తర్​.. 178 వికెట్లు తీశాడు. 163 వన్డేల్లో 247, 15 టీ-20ల్లో 19 వికెట్ల చొప్పున తీశాడు. ఆ దేశ దిగ్గజ బౌలర్లలో అక్తర్​ ముందు వరుసలో ఉంటాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత.. సొంతంగా యూట్యూబ్​ ఛానల్​ పెట్టుకున్న అక్తర్​.. తరచూ క్రికెట్​ గురించి మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు.

ఇదీ చూడండి: ఐసీసీ నిద్రపోతుందా?.. ఇంజమామ్​ ఆగ్రహం!

ABOUT THE AUTHOR

...view details