తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2021, 10:17 AM IST

Updated : Feb 7, 2021, 11:01 AM IST

ETV Bharat / sports

తొలి టెస్టు: 578 పరుగులకు ఇంగ్లాండ్​ ఆలౌట్​

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 578 పరుగులకు ఇంగ్లాండ్​ ఆలౌటైంది. మూడో రోజు మరో 23 పరుగులు జోడించి రూట్ సేన చివరి రెండు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్​ చెరో 3 వికెట్లు తీసుకున్నారు.

england allout in first test first innings
578 పరుగులకు ఇంగ్లాండ్​ ఆలౌట్​

చెన్నై టెస్టులో ఇంగ్లాండ్​ పట్టుబిగించింది. 555/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్​ ఆట కొనసాగించిన ఆ జట్టు​.. 578 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్​ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్​, నదీమ్​ తలో రెండు వికెట్లు సాధించారు.

మరో 10.1 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్​ టెయిలెండర్లు మరో 23 పరుగులు చేశారు. డొమినిక్​ బెస్​ (34, 105 బంతుల్లో 4x6)​.. 567 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరుగగా.. అండర్సన్​ను అశ్విన్ క్లీన్​బౌల్డ్​ చేశాడు. ​

ఇదీ చదవండి:'చివరి సెషన్​లో ఇషాంత్​ బౌలింగ్​​ అద్భుతం'

Last Updated : Feb 7, 2021, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details