తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2021, 11:10 PM IST

ETV Bharat / sports

IND vs ENG: ఇంగ్లాండ్​కు స్వల్ప ఆధిక్యం.. 391 ఆలౌట్​

లార్డ్స్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 391 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. కెప్టెన్ రూట్​ భారీ సెంచరీతో మెరుగైన ప్రదర్శన చేశాడు. బెయిర్​ స్టో హాఫ్​ సెంచరీతో రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ 3, సిరాజ్ 4 వికెట్లతో మెరిశారు.

england vs india
ఇండియా vs ఇంగ్లాండ్

లార్డ్స్​ టెస్టులో ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ భారీ సెంచరీతో (180; 321 బంతుల్లో) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్​లో ఆ జట్టు 391 పరుగులకు ఆలౌటైంది. రూట్​ ఇన్నింగ్స్​కు తోడు బెయిర్​ స్టో (57; 107 బంతుల్లో), రోరీ బర్న్స్​ (49; 136 బంతుల్లో) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో సిరాజ్​ 4, ఇషాంత్​ శర్మ 3, షమీ 2 వికెట్ల​తో రాణించారు.

314/5తో టీ విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్​ చివరి సెషన్​లో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. మొయిన్ అలీ- రూట్​ జోడీ ఆరో వికెట్​కు 58 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను ఇషాంత్​ శర్మ విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సామ్ కరన్​ను మరుసటి బంతికే పెవిలియన్​ పంపాడు ఇషాంత్​. మరికాసేపటికే రాబిన్సన్​ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు సిరాజ్​.

ABOUT THE AUTHOR

...view details