తెలంగాణ

telangana

ఇంగ్లాండ్​ కుర్రాళ్ల చేతిలో పాక్ ఓటమి

By

Published : Jul 9, 2021, 1:02 PM IST

ఇంగ్లాండ్ బౌలర్ సకీబ్ మహ్మూద్​ (4 వికెట్లు) ధాటికి తొలి వన్డేలో పాకిస్థాన్ విలవిల్లాడింది. 9 వికెట్ల తేడాతో పూర్తిగా యువ జట్టు అయిన ఇంగ్లాండ్​ చేతిలో ఓడింది.

Pakistan vs England
ఇంగ్లాండ్

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాభవం చవిచూసింది పాకిస్థాన్​. మూడు మ్యాచ్​ల సిరీస్​లో మొదటి మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ యువ బౌలర్ సకీబ్ మహ్మూద్ (4/42) పాక్ క్రికెటర్లకు చుక్కలు చూపించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన పాక్.. మరో 15 ఓవర్లు మిగిలుండగా 141 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్ ఆదిలోనే అరంగేట్ర బ్యాట్స్​మన్ ఫిలిప్​ సాల్ట్​(7) వికెట్ కోల్పోయింది. అయితే డేవిడ్ మలన్(68*), జాక్ క్రాలీ(58*) మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు.

కుర్రాళ్ల చేతిలో..

అయితే ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ దాదాపు కొత్త జట్టుతోనే బరిలోకి దిగడం విశేషం. కరోనా కారణంగా తొలుత అనుకున్న సీనియర్​ జట్టు ఐసోలేషన్​కు వెళ్లగా.. 15 మందితో కొత్త జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. అందులో 9 మంది పూర్తిగా కొత్తవాళ్లు. అలాంటి జట్టు చేతిలో పాక్​ చతికిలపడిపోయింది.

ఇదీ చూడండి:భారత్-ఇంగ్లాండ్ టెస్టులు ఆగితే కోట్ల డాలర్లు నష్టం?

ABOUT THE AUTHOR

...view details