తెలంగాణ

telangana

By

Published : Aug 15, 2021, 9:54 PM IST

ETV Bharat / sports

ఇంగ్లాండ్ ఆటగాళ్ల వింత ప్రవర్తన.. టాంపరింగేనా?

లార్డ్స్​ టెస్టు నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు. బంతిని కాలితో తొక్కుతూ ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ విషయంపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

india vs england
ఇండియా vs ఇంగ్లాండ్

లార్డ్స్​ టెస్టులో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. భారత ఇన్నింగ్స్​ 34వ ఓవర్​ సందర్భంగా ఆతిథ్య జట్టు బౌలర్లు రాబిన్సన్​, మార్క్​ వుడ్​ బంతిని కాలితో తొక్కుతూ ట్యాంపరింగ్​కు పాల్పడ్డట్లు కనిపించారు. బూట్ల స్పైక్​తో బాల్​ను అటు ఇటూ తన్నారు. బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించారు. దీనిపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆతిథ్య జట్టు ప్లేయర్ల తీరును తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టిన టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ట్విట్టర్​లో స్పందించాడు. "ఇండియా- ఇంగ్లాండ్​ మ్యాచ్​లో బాల్​ ట్యాంపరింగ్?" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు.

ఆ సమయంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షాన్​ పొలాక్​ కూడా ఈ అంశంపై అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్​ రిఫరీ ఈ విషయంపై దృష్టి సారించాల్సిందిగా కోరాడు. మరో వ్యాఖ్యాత హర్ష భోగ్లే దీనిని ఖండించారు. ఈ ఘటన అనంతరం అంపైర్లు బంతిని కూడా మార్చలేదు.

ఇంగ్లాండ్​ పేసర్​ స్టువర్ట్​ బ్రాడ్​ మాత్రం ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా చెప్పుకొచ్చాడు. ట్విట్టర్​లో ఓ అభిమాని సందేహానికి బదులిచ్చిన అతడు.. "మీరు అనుకున్నట్లు ఏం జరగలేదు" అని స్పష్టం చేశాడు. దీనిపై ఐసీసీ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.

కొవిడ్ నివారణ చర్యల ద్వారా ఇంగ్లాండ్​ ఆటగాళ్లు బాల్​ టాంపరింగ్​కు పాల్పడుతున్నారా? అంటూ టీమ్ఇండియా మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

ఇదీ చదవండి:Ind vs Eng Test: కోహ్లీ, జిమ్మీ మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details