తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సెమీస్​': భారత్​Xకివీస్​.. ఆసీస్​Xఇంగ్లాండ్​ - మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్

ప్రపంచకప్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్​ల ఫలితాల ఆధారంగా టాప్​ నాలుగు జట్ల స్థానాలు ఖరారయ్యాయి. చివరి లీగ్​ మ్యాచ్​ల్లో భాగంగా శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో​ విజయం సాధించగా... మరో పోరులో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచింది దక్షిణాఫ్రికా.

భారత్​Xన్యూజిలాండ్​ - ఆస్ట్రేలియాXఇంగ్లాండ్​

By

Published : Jul 7, 2019, 6:29 AM IST

Updated : Jul 7, 2019, 7:28 AM IST

క్రికెట్​ ప్రపంచకప్​ తుది దశకు చేరుకుంది. లీగ్​ దశ అనంతరం.. టాప్​ 4 జట్ల స్థానాలు, సెమీస్​లో తలపడబోయే ప్రత్యర్థులు, వేదికలపై స్పష్టత వచ్చింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్​ల ఫలితాల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో నిలిచింది టీమిండియా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ వరుసగా మిగతా స్థానాల్లో నిలిచాయి.

మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా మంగళవారం (జులై 9న) జరిగే తొలి సెమీస్​లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. టోర్నీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్​.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. అగ్రస్థానం దక్కించుకున్న భారత్​ .. నాలుగో స్థానంలోని కివీస్​తో తలపడనుంది. మూడో స్థానంలో నిలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్‌తో గురువారం (జులై 11న) బర్మింగ్​ హామ్​ వేదికగా రెండో సెమీఫైనల్లో తలపడుతుంది ఆసీస్‌.

శనివారం జరిగిన చివరి లీగ్​ మ్యాచ్​ల్లో భాగంగా శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో​ విజయం సాధించగా... మరో పోరులో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచింది దక్షిణాఫ్రికా.

Last Updated : Jul 7, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details