తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2020, 7:50 AM IST

Updated : Mar 2, 2020, 8:01 PM IST

ETV Bharat / sports

టీ20: బంగ్లాపై ఆసీస్​ గెలుపు.. సెమీస్​ ఆశలు సజీవం

మహిళల టీ20 ప్రపంచకప్​లో భారత్​ చేతిలో దెబ్బతిన్న ఆస్ట్రేలియా... ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్​లోనూ గెలుపొందింది. గురువారం బంగ్లాతో జరిగిన పోరులో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్​ బ్యాట్స్​వుమన్​ హీలీ, బెత్​ మూనీ అర్ధశతకాలతో అదరగొట్టారు.

Women T20 Worldcup 2020
టీ20 ప్రపంచకప్​

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిన ఆసీస్​ అమ్మాయిలు.. ఆ తర్వాత శ్రీలంకపై నెగ్గారు. తాజాగా మూడో మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా గ్రూప్​-ఎ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

కాన్‌బెర్రా వేదికగా గురువారం జరిగిన గ్రూప్​-ఎ పోరులో... ఆసీస్​ జట్టు 86 పరుగలు తేడాతో బంగ్లాపై ఘనవిజయం సాధించింది. కంగారూ జట్టు బ్యాట్స్​వుమన్​ అలీసా హీలీ (83), బెత్‌ మూనీ (81 నాటౌట్‌) సత్తా చాటారు.

మొదట ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు హీలీ, మూనీ తొలి వికెట్‌కు రికార్డు 151 పరుగులు జోడించారు. మెగాన్‌ షట్‌ (3/21), జెస్‌ జొనాసెన్‌ (2/17) ధాటికి.. ఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. ఫర్జానా (36) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. హీలీకి 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​' అవార్డు దక్కింది.

'గ్రూప్​-ఎ'లో ఇప్పటికే మహిళా టీమిండియా సెమీస్​ బెర్త్​ ఖరారు చేసుకోగా.. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి.

Last Updated : Mar 2, 2020, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details