తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన విండీస్​ బౌలర్లు.. భారత్​ 268/7

ప్రపంచకప్​లో భాగంగా మాంచెస్టర్​లో విండీస్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు సాధించింది. ధోనీ, కోహ్లీ అర్ధశతకాలతో మెరిశారు.

By

Published : Jun 27, 2019, 7:34 PM IST

మెరిసిన విండీస్​ బౌలర్లు.. భారత్​ 268/7

మాంచెస్టర్‌లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా విండీస్​తో మ్యాచ్​లో భారత్​ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కోహ్లీ, ధోనీ అర్ధశతకాలతో రాణించగా... రాహుల్ 48 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. చివర్లో పాండ్య బ్యాట్​ ఝుళిపించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​ ప్రారంభంలోనే రోహిత్ శర్మ (18) వికెట్ కోల్పోయింది. అనంతరం రాహుల్​, కోహ్లీ కాసేపు విండీస్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించారు. రాహుల్ కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్​ చేసుకుని 48 పరుగుల వద్ద ఔటయ్యాడు. బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లీ 82 బంతుల్లో 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్​లో విరాట్​కిది వరుసగా నాలుగో అర్ధసెంచరీ.

జాదవ్ (7), విజయ్ శంకర్ (14) మరోసారి విఫలమయ్యారు. మిడిల్​లో వచ్చిన ధోనీ, హార్దిక్ పాండ్యతో కలిసి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కృషి చేశారు. ధోనీ నెమ్మదిగా ఆడితే పాండ్య తనదైన శైలిలో పరుగులు సాధించాడు. 49వ ఓవర్లో భారీ షాట్​ ఆడబోయి పాండ్య (46) పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో ఓ సిక్సు, ఫోర్ బాదిన ధోనీ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు.

వెస్టిండీస్ బౌలర్లు భారత బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. రోచ్ ప్రారంభంలోనే మూడు వికెట్లు తీసి టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. హోల్డర్, కాట్రెల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details