తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రతిరోజు నన్ను నేను మెరుగుపరుచుకుంటా'

ప్రపంచకప్​లో విజయ్ శంకర్ స్థానంలో టీమిండియాకు ఎంపికైన మయాంక్ అగర్వాల్.. ఈటీవీ భారత్​తో ముచ్చటించాడు. ఆటగాడిగా తనని తాను ప్రతీరోజు మెరుగుపరుచుకుంటానని చెప్పాడు.

By

Published : Jul 1, 2019, 6:58 PM IST

'ప్రతీరోజు నన్ను నేను మెరుగుపరుచుకుంటా'

ఈటీవీ భారత్​తో మయాంక్ అగర్వాల్ ముఖాముఖి

గాయం కారణంగా ప్రపంచకప్​కు దూరమయ్యాడు విజయ్ శంకర్. అతడి స్థానంలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్. ప్రతిరోజు తన ఆటను మెరుగుపరుచుకుంటానని చెప్పాడీ క్రికెటర్. ఐపీఎల్​లో విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడటం తనకెంతో ఉపయోగపడిందని అన్నాడు. మరెన్నో విషయాల్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నాడు.

28 ఏళ్ల మయాంక్ అగర్వాల్.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అందులో ఆడిన తొలి మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లో వరుసగా 76, 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

గత 24 నెలల్లో లిస్ట్-ఏ క్రికెట్​లో 1747 పరుగులు చేశాడు మయాంక్ అగర్వాల్. ఇంగ్లాండ్ పరిస్థితుల్లోనూ ఆడిన అనుభవముంది. ఆ దేశంలో ఆడిన 6 మ్యాచుల్లో 88.40 సగటుతో 442 పరుగులు సాధించాడీ క్రికెటర్. అందులో 3 సెంచరీలు ఉన్నాయి.

ప్రపంచకప్ నుంచి గాయం కారణంగా వైదొలగిన విజయ్ శంకర్.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో మొత్తం 58 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. పాకిస్థాన్​తో మ్యాచ్​లో వేసిన తొలి బంతికి వికెట్ సాధించాడు.

టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్

ఇది చదవండి: ప్రపంచకప్​ నుంచి విజయ్ శంకర్ ఔట్

ABOUT THE AUTHOR

...view details