తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం

ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ బ్యాట్స్​మెన్​, టీమిండియా సారథి విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. అతడి మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠాత్మక లార్డ్స్​ మైదానంలో ఆవిష్కరించింది మేడమ్​ టుస్సాడ్స్​ సంస్థ.

By

Published : May 30, 2019, 10:47 AM IST

భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం..

ప్రపంచకప్​ నేపథ్యంలో ప్రఖ్యాత మేడమ్​ టుస్సాడ్స్​ మ్యూజియం బుధవారం విరాట్​కోహ్లీ మైనపు విగ్రహాన్ని లార్డ్స్​ మైదానంలో ఆవిష్కరించింది. గురువారం నుంచి జూలై 15 వరకు ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు.

లార్డ్స్​లో విరాట్​ మైనపు విగ్రహం

" కొన్ని వారాల పాటు క్రికెట్​ ఫీవర్​తో దేశం ఉర్రూతలూగిపోనుంది. లార్డ్స్​లో విరాట్​ కోహ్లీ విగ్రహం పెట్టడంకన్నా పెద్ద సంబరం ఉంటుందా.! క్రికెట్​ అభిమానులు తమ ఇష్టమైన ఆటగాడిని స్టేడియంలో చూడటమే కాకుండా ఫొటో దిగే అవకాశం కల్పించాం ".
-- స్టీవ్​ డేవిస్​, మేడమ్​ టుస్సాడ్స్​ జనరల్​ మేనేజర్

లార్డ్స్​ మైదానంలోని ఎమ్​సీసీ మ్యూజియంలో భారతీయ జెర్సీతో కనువిందు చేయనుంది విరాట్​ విగ్రహం. దీనికోసం కోహ్లీ తన షూ, గ్లౌవ్స్​ ఇచ్చినట్లు వెల్లడించిందీ సంస్థ. గురువారం నుంచి వీక్షకుల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. ఇప్పటికే ఉసేన్​ బోల్ట్, సర్​ మో ఫరా, మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ విగ్రహాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి.

ఇవీ చూడండి....

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details