తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ బౌలర్​​కు అంపైర్​ వార్నింగ్​ ఎందుకు? - pakvsind

భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​ సందర్భంగా పాక్​ బౌలర్​ ఆమిర్​ను రెండు సార్లు హెచ్చరించాడు అంపైర్ బ్రూస్​ ఆక్సన్​ఫోర్డ్​​. బౌలింగ్​ వేస్తూ డేంజర్​ ఏరియాలోకి ప్రవేశిస్తున్నాడని కెప్టెన్​కు సూచించాడు. అసలు డేంజర్​ ఏరియా అంటే ఏంటి..?

పాక్​ బౌలర్​ ఆమిర్​కు అంపైర్​ వార్నింగ్​ ఎందుకు..?

By

Published : Jun 16, 2019, 4:30 PM IST

క్రికెట్​లోని వికెట్ల మధ్య భాగాన్ని పిచ్​ అంటారు. వికెట్ల నుంచి ఐదు అడుగుల దూరం, రెండు అడుగుల వెడల్పుగా ఉన్న ప్రాంతాన్ని డేంజర్​ ఏరియా లేదా ప్రొటెక్టెడ్​ ఏరియాగా పిలుస్తారు. ఐసీసీ క్రికెట్​ నిబంధనల ప్రకారం బౌలర్​ బంతి వేశాక ఆ ప్రాంతంలో నడవకూడదు, పరిగెత్తకూడదు.

ఆట సమయంలో బ్యాట్స్​మెన్ లేదా బౌలర్ పిచ్​పై నడవకూడదు. ఎందుకంటే బంతి సాధారణంగా పిచ్​పైనే బౌన్స్​ అవుతుంది. ఒకవేళ ఈ పిచ్​ను బౌలర్​ తన కాలి అడుగులతో తొక్కితే ఆ అడుగుల్లో పడిన బంతి బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెడుతుంది. సమాంతరంగా ఉండాల్సిన పిచ్​ బౌలర్​కు ఎక్కువగా సహకరిస్తుంది. ఫలితంగా మ్యాచ్​లో పారదర్శకత లోపిస్తుంది. ఈ అవకాశంతో బౌలర్లు మ్యాచ్​ను మార్చేసే అవకాశం ఉంది.

మూడోసారి తర్వాత వేటు...

బౌలర్​ డేంజర్​ ఏరియాలో అడుగులు వేస్తే అంపైర్​ బౌలర్​కు, ఆ జట్టు కెప్టెన్​కు వార్నింగ్​ ఇస్తాడు. ఇది మూడు అవకాశాల వరకు ఉంటుంది. ఒక వేళ మూడు హెచ్చరికలను పెడచెవిన పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే... మ్యాచ్ మొత్తానికి బౌలింగ్​ వేయకుండా ఆ బౌలర్​ను​ ఆపే అధికారం అంపైర్​ చేతుల్లో ఉంటుంది.

  • భారత్​-పాక్​ మ్యాచ్​లో పాకిస్థాన్​ ఫాస్ట్​ బౌలర్​ ఆమిర్​ రెండు సార్లు ఈ నిబంధన ఉల్లంఘించాడు.
    పిచ్​ మధ్యలో నడుస్తున్న ఆమిర్​

ABOUT THE AUTHOR

...view details