తెలంగాణ

telangana

అంతర్జాతీయ వన్డేలకు షోయబ్​ మాలిక్​ గుడ్​బై

By

Published : Jul 6, 2019, 7:44 AM IST

పాకిస్థాన్​ ఆల్​రౌండర్​​ షోయబ్​ మాలిక్​ వన్డే క్రికెట్​ నుంచి రిటైరయ్యాడు. ప్రపంచకప్​లో శుక్రవారం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పాక్​ అభిమానులు, సహచరుల నుంచి లార్డ్స్​ మైదానంలో గౌరవ వీడ్కోలు స్వీకరిస్తూ... ఆటకు ముగింపు పలికాడు.

అంతర్జాతీయ వన్డేలకు షోయబ్​ మాలిక్​ గుడ్​బై

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌ీలోని తన చివరి లీగ్​ మ్యాచ్​ అనంతరం వన్డే క్రికెట్​ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు పాక్​ జట్టు సీనియర్​ ఆటగాడు షోయబ్​ మాలిక్​. శుక్రవారం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మ్యాచ్​లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ క్రికెటర్​... వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

భారత్​పై గోల్డెన్​ డకౌట్​...

ప్రస్తుత ప్రపంచకప్​లో దారుణంగా విఫలమయ్యాడు షోయబ్​ మాలిక్​. ఆల్​రౌండర్​గా.. 15 మంది జట్టు సభ్యుల జాబితాలో చోటు లభించినా ఆశించిన మేర ప్రతిభ చూపించలేకపోయాడు. 3 మ్యాచ్​ల్లో బ్యాటింగ్​కు దిగి మొత్తం 8 పరుగులే చేశాడు. వాటిలో రెండు డకౌట్లు (ఆస్ట్రేలియా, భారత్​) ఉన్నాయి. చివరిగా ఈ వరల్డ్​కప్​లో మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ మైదానంలో జూన్​ 16న టీమిండియాతో మ్యాచ్​లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్​లో గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగాడు షోయబ్​. అదే అతనికి చివరి మ్యాచ్​.

37 ఏళ్ల మాలిక్​ 2015లో టెస్టు క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. 287 వన్డేలు ఆడిన ఈ క్రికెటర్​.. 34.55 సగటుతో 7 వేల 534 పరుగులు చేశాడు. బౌలింగ్​లోనూ రాణించి 158 వికెట్లు పడగొట్టాడు. 35 టెస్టులు ఆడిన ఈ సీనియర్​ క్రికెటర్​... 1898 పరుగులు చేసి 32 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

షోయబ్​ మాలిక్​

ఐసీసీ ప్రపంచకప్​ 2019లో పాకిస్థాన్​ జట్టు 11 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్​తో సమానంగా పాయింట్లు సాధించినా... నెట్​ రన్​రేట్​ తేడాతో నాకౌట్​ రేసు నుంచి నిష్క్రమించింది.

ABOUT THE AUTHOR

...view details