తెలంగాణ

telangana

పాక్​​ సారథి సర్ఫ్​రాజ్​ ఆవలింతలు... నెట్టింట ట్రోల్​

By

Published : Jun 16, 2019, 9:10 PM IST

ఐసీసీ పురుషుల క్రికెట్​ వరల్డ్​ కప్​లో భాగంగా నేడు భారత్​- పాకిస్థాన్​ మధ్య మ్యాచ్​. మాంచెస్టర్​ వేదికగా జరుగుతున్న ఈ పోరులో సర్ఫ్​రాజ్ చేసిన​ ​ఆవలింతలు నెట్టింట వైరల్​గా మారాయి.

పాక్​​ సారథి సర్ఫరాజ్​ ఆవలింతలు... నైట్టింట ట్రోల్​

పాక్​ సారథి సర్ఫ్​రాజ్​ అహ్మద్​ నెటిజన్ల చేతికి చిక్కాడు. భారత్​తో మ్యాచ్​ జరుగుతుండగా... ఆవలిస్తూ కనిపించాడీ క్రికెటర్​. ఈ సంఘటన భారత ఇన్నింగ్స్​ 46.4వ ఓవర్​ వద్ద చోటు చేసుకుంది. వర్షం కారణంగా ఆట అరగంట నిలిచింది. అనంతరం తిరిగి ప్రారంభమైన సమయంలో సర్ఫ్​రాజ్​ ఆవలిస్తూ స్టేడియంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటోలను ట్రోలింగ్​ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా మ్యాచ్​లో అతడి కదలికల్ని ​కామెంట్లుగా పెట్టి మీమ్స్​తో నింపేస్తున్నారు.

నెటిజన్ల ట్వీట్లు

తొలుత టాస్​ గెలిచి బౌలింగ్​​ ఎంచుకుంది పాకిస్థాన్​. భారత ఓపెనర్లు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించి ఇన్నింగ్స్​కు మంచి పునాది వేశారు. రోహిత్​ కెరీర్​లో 24వ శతకం ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ వన్డేల్లో వేగంగా 11వేల పరుగుల మైలురాయి అందుకొని రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్​లో నిర్ణీత 50 ఓవర్లకు 336 పరుగులు చేసింది టీమిండియా.

ABOUT THE AUTHOR

...view details