తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంతర్జాతీయ క్రికెట్​లో ఓవర్​త్రోలపై సమీక్ష - మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్

ప్రపంచకప్​ ఫైనల్​లో వివాదాస్పదమైన ఓవర్​త్రో కారణంగా ఆ నిబంధనపై పునరాలోచించాలని నిర్ణయించింది మెరిల్​బోన్ క్రికెట్ క్లబ్.

అంతర్జాతీయ క్రికెట్​లో ఓవర్​త్రోలపై సమీక్ష

By

Published : Jul 20, 2019, 3:25 PM IST

ఓ ఓవర్​ త్రో.. ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ మధ్య జరిగిన ప్రపంచకప్​ ఫైనల్​లో వివాదానికి కారణమైంది. ఈ విషయం వల్ల నిర్వహకులను అందరూ విమర్శించారు. ఇప్పుడు ఈ నియమంపై పునరాలోచనలో ఉంది మెరిల్​బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్​సిసి).

"ఎమ్.సి.సి తన నిబంధనల్లోని ఓవర్​త్రో అంశంపై పునరాలోచించుకోవాలని నిర్ణయించుకుంది." -ద సండే టైమ్స్ రిపోర్ట్

ఆ ఓవర్​ త్రో అనంతరం స్టోక్స్ పరిస్థితి

అసలు కారణం ఇదే..!

లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్​ ఫైనల్​లో ఇంగ్లాండ్​ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. అప్పుడు రెండు పరుగులు తీసేందుకు స్టోక్స్ ప్రయత్నించాడు. ఆ సమయంలో కివీస్​ ఆటగాడు గప్తిల్ బంతిని కీపర్​ వైపు విసిరాడు. క్రీజులోకి రాబోతున్న స్టోక్స్ బ్యాట్​ను తాకిన ఆ బంతి బౌండరీకి వెళ్లింది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన.. మొత్తం ఆరు పరుగులు(2+4) ఇచ్చారు.

ఆ తర్వాత మ్యాచ్​ టైగా ముగిసింది. అనంతరం సూపర్​ ఓవర్​ టై అయింది. మ్యాచ్​ మొత్తంలో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్​ విజేతగా అవతరించింది.

ఈ విషయంపై స్పందించిన ఐసీసీ ఎలైట్ ప్యానల్​ మాజీ అంపైర్​ సైమన్ టాఫెల్.. ఆ త్రోకు ఐదు పరుగులు ఇవ్వాల్సిందని చెప్పారు.

ఇది చదవండి: రిటైర్ అవ్వట్లేదు.. కానీ విండీస్ పర్యటనకు దూరం

ABOUT THE AUTHOR

...view details