తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు!

భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్​ను వరుణుడు దెబ్బతీసేలా ఉన్నాడు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వాన వల్ల మైదానం చిత్తడిగా మారుతోంది. కోహ్లీసేన నెట్​ ప్రాక్టీస్​కు కూడా పిచ్ అనుకూలించలేదు.

By

Published : Jun 13, 2019, 1:04 PM IST

వర్షం

నాటింగ్​హామ్ వేదికగా భారత్​ - న్యూజిలాండ్ మ్యాచ్​కు వర్షం అడ్డంకిగా మారనుంది. సోమవారం నుంచి విస్తారంగా వర్షం కురుస్తోంది. టీమిండియా నెట్​ ప్రాక్టీస్​కు కూడా పిచ్ అనుకూలించలేదు. మైదానమంతా చిత్తడిగా మారుతోంది. వాన కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు.పూర్తిగా రద్దయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

ఇప్పటికే వర్షం కారణంగా మూడు మ్యాచ్​లు తుడిచిపెట్టుకుపోయాయి. ఒకవేళ ఈ రోజు మ్యాచ్​ జరగనట్లయితే ఈ నెల 16న జరగాల్సిన పాకిస్థాన్​తో మ్యాచ్​ భారత్​కు కీలకం కానుంది. రెండు మ్యాచుల్లో నెగ్గిన భారత్ నాలుగు పాయింట్లు సాధించి నాలుగోస్థానంలో ఉంది.

మూడు మ్యాచ్​ల్లో గెలిచిన కివీస్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే ఏడు పాయింట్లతో న్యూజిలాండ్​కు సెమీస్ అవకాశాలు మెరుగౌతాయి.

ABOUT THE AUTHOR

...view details