తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2019, 10:38 AM IST

ETV Bharat / sports

'టోర్నీ మధ్యలో జింగ్​ బెయిల్స్ మార్చలేం'

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో వివాదాస్పదంగా మారిన జింగ్​ బెయిల్స్​ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్ స్పష్టంచేసింది. బెయిల్స్ ఇక పైనా అలానే కొనసాగనున్నాయి. టోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులూ కుదరవని తేల్చిచెప్పింది ఐసీసీ.

'టోర్నీ మధ్యలో జింగ్​ బెయిల్స్ మార్చలేం'

ఐసీసీ ప్రపంచకప్ 2019​లో జింగ్​ బెయిల్స్​ బాగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బంతి తగిలి లైట్లు వెలిగినా బెయిల్స్​ పడట్లేదంటూ భారత సారథి విరాట్​ కోహ్లీ, ఆస్ట్రేలియా సారథి ఆరోన్​ ఫించ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఐసీసీ... టోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులు చేయబోమని స్పష్టం చేసింది.

"ఈ మెగా ఈవెంట్​ సమగ్రతకు భంగం కలిగిస్తూ టోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులు చేయము. పది జట్లు ఆడే 48 మ్యాచ్​లకు వీటినే ఉపయోగిస్తాం. గత వరల్డ్‌కప్ నుంచి అన్ని అంతర్జాతీయ ఆటలకు ఇవే బెయిల్స్ వినియోగిస్తున్నాం. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు తలెత్తుతోంది. ఇవన్నీ ఆటలో భాగమే. టోర్నీ మధ్యలో మార్పులు కుదరవు".
--అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​

ఇప్పటివరకు ప్రపంచకప్​ ప్రారంభమై రెండు వారాలు ముగిసింది. జరిగిన 16 మ్యాచుల్లో ఐదు సార్లు బంతి తాకినా బెయిల్స్​ పడని ఘటనలు ఉత్పన్నమయ్యాయి. జూన్​ 9న ఆస్ట్రేలియాతో పోరు​లో టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో... బంతి లెగ్‌ స్టంప్‌ను బలంగా తాకినా బెయిల్స్‌ పడలేదు. ఫలితంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్​లో అతడు అర్ధశతకంతో రాణించాడు.

బంతి తాకినా ఔట్​ కాని వార్నర్​

బెయిల్స్ మధ్యలో వైర్లు...

బంతి వికెట్లను తాకినప్పుడు కనిపించేందుకు వీలుగా బెయిల్స్​, స్టంప్స్​ లోపల లైట్లు అమర్చారు. అయితే వాటికి ఉన్న వైర్ల బరువు వల్లే బెయిల్స్ పడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంతి వికెట్లకు తాకి బెయిల్స్​ పడకపోతే బ్యాట్స్​మెన్​ను నాటౌట్​గా ప్రకటించడం క్రికెట్​ నిబంధన.

బెయిల్స్​ చెక్​ చేస్తోన్న ధోనీ

ఇవీ చూడండి:

ఎల్​ఈడీ లైట్ల వల్లే జింగ్​ బెయిల్స్​ పడట్లేదా..!

ABOUT THE AUTHOR

...view details