శిఖర్ ధావన్ ప్రపంచకప్లో కనీసం 3 మ్యాచ్లకు దూరం కానున్నట్టు బీసీసీఐ ప్రతినిధి తెలిపారు . ఇంగ్లాండ్లోనే ఉండి బీసీసీఐ పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోనున్నట్టు చెప్పారు. ఆసీస్తో మ్యాచ్లో ధావన్ ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. ఫలితంగా.. 3 వారాల పాటు మ్యాచ్లకు దూరం కానున్నాడు.
WC19: ఇంగ్లాండ్లోనే బీసీసీఐ పర్యవేక్షణలో ధావన్
ఇంగ్లాండ్లోనే బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ధావన్ విశ్రాంతి తీసుకోనున్నట్టు బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. కనీసం మూడు మ్యాచ్లకు శిఖర్ దూరమయ్యే అవకాశముందని చెప్పారు.
"భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు. గాయం నుంచి కోలుకునేంత వరకు ఇంగ్లాండ్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోనున్నాడు. ఎడమ చేతి బొటన వేలుకు, చూపుడు వేలుకు మధ్య గాయమైంది. ధావన్ స్థానంలో ఆడేది ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అతడు 3 మ్యాచ్లకు దూరమయ్యే అవకాశముంది. అనుకున్న సమయం కంటే శిఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం" -బీసీసీఐ ప్రతినిధి
ధావన్ స్థానంలో ఎవరు ఆడతారు అనే దానిపై బీసీసీఐ స్పష్టత ఇవ్వనప్పటికీ క్రీడా సమాజం నుంచి రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రిషభ్ పంత్, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి.