తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమానులకు కిక్​ ఇచ్చే కవిత చెప్పిన ధావన్​ - worldcup

ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో గాయపడిన టీమిండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​ అభిమానులను ఉద్దేశించి ఓ కవిత ట్వీట్​ చేశాడు. ఇలాంటి చిన్న చిన్న దెబ్బలతో టీమిండియా, అభిమానులు అధైర్యపడరనే సందేశాన్ని వినిపించాడు.

శిఖర్

By

Published : Jun 12, 2019, 6:26 PM IST

భారత జట్టు స్టార్​ బ్యాట్స్​మన్​, ఓపెనర్​ శిఖర్​ ధావన్ ఎడమ చేతి బొటన వేలు గాయం కారణంగా ప్రపంచకప్​ టోర్నీకి మూడు వారాలు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయం తెలియగానే యావత్​ దేశం షాక్​కు గురైంది. తాజాగా శిఖర్​ ఓ కవితతో భార‌త అభిమానుల్లో మ‌నోధైర్యం నింపాడు. ఉర్దూ క‌వి డా.రాహ‌త్ ఇందోరి రాసిన ఓ క‌విత‌ను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు.

" కొన్నిసార్లు మనం పువ్వుల్లా వికసిస్తాం. మరికొన్ని సార్లు పర్వతాలపైన మంచు పొగలా అత్యున్నతంగా ఉంటాం. మనం పైకి ఎగురుతుంటే ఎవరూ మన రెక్కలను కత్తిరించలేరు. ఎందుకంటే ధైర్యంగా విహరించగల సత్తా మనలో ఉంది" అంటూ ధావన్​ సందేశాన్ని పోస్టు చేశాడు.

తదుపరి మ్యాచ్​లకు ఓపెనర్లుగా రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నారు. ధావ‌న్ స్థానంలో రిష‌భ్​ పంత్ ఇంగ్లాండ్‌కు ప‌య‌న‌మ‌య్యాడు. న్యూజిలాండ్​, పాకిస్థాన్​, ఆఫ్గాన్​తో మ్యాచ్​లకు ధావన్ బదులుగా రిషభ్, దినేశ్​ కార్తీక్​, విజయ్​ శంకర్​లలో ఎవరో ఒకరికి అవకాశం రానుంది.

ABOUT THE AUTHOR

...view details