భారత జట్టు స్టార్ బ్యాట్స్మన్, ఓపెనర్ శిఖర్ ధావన్ ఎడమ చేతి బొటన వేలు గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీకి మూడు వారాలు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయం తెలియగానే యావత్ దేశం షాక్కు గురైంది. తాజాగా శిఖర్ ఓ కవితతో భారత అభిమానుల్లో మనోధైర్యం నింపాడు. ఉర్దూ కవి డా.రాహత్ ఇందోరి రాసిన ఓ కవితను తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.
అభిమానులకు కిక్ ఇచ్చే కవిత చెప్పిన ధావన్ - worldcup
ఆస్ట్రేలియాతో మ్యాచ్లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అభిమానులను ఉద్దేశించి ఓ కవిత ట్వీట్ చేశాడు. ఇలాంటి చిన్న చిన్న దెబ్బలతో టీమిండియా, అభిమానులు అధైర్యపడరనే సందేశాన్ని వినిపించాడు.
" కొన్నిసార్లు మనం పువ్వుల్లా వికసిస్తాం. మరికొన్ని సార్లు పర్వతాలపైన మంచు పొగలా అత్యున్నతంగా ఉంటాం. మనం పైకి ఎగురుతుంటే ఎవరూ మన రెక్కలను కత్తిరించలేరు. ఎందుకంటే ధైర్యంగా విహరించగల సత్తా మనలో ఉంది" అంటూ ధావన్ సందేశాన్ని పోస్టు చేశాడు.
తదుపరి మ్యాచ్లకు ఓపెనర్లుగా రోహిత్శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను మొదలుపెట్టనున్నారు. ధావన్ స్థానంలో రిషభ్ పంత్ ఇంగ్లాండ్కు పయనమయ్యాడు. న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్గాన్తో మ్యాచ్లకు ధావన్ బదులుగా రిషభ్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్లలో ఎవరో ఒకరికి అవకాశం రానుంది.