తెలంగాణ

telangana

ETV Bharat / sports

'జట్టుకు ధోనీ సేవలు ఎంతో అవసరం'

ప్రపంచకప్​లో మహేంద్ర సింగ్​ ధోనీ సలహాలు కీలకంగా మారనున్నాయని భారత కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఈ ఐపీఎల్​లో బ్యాటింగ్​లోనూ అద్భుతంగా ఆకట్టుకున్నాడని, వరల్డ్​కప్​లో మెరుగైన ప్రదర్శన చేస్తాడని ఆశించాడు.

By

Published : May 21, 2019, 6:10 PM IST

రవిశాస్త్రి

మీడియాతో మాట్లాడుతున్న రవిశాస్త్రి, విరాట్

ప్రపంచకప్​ కోసం భారత క్రికెట్​ జట్టు ఇంగ్లాండ్​కు వెళ్లనున్న తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రీ ముంబయిలో మీడియాతో మాట్లాడారు. వరల్డ్​కప్​​లో మహేంద్ర సింగ్ ధోనీ కీలకపాత్ర పోషించనున్నాడని రవిశాస్త్రి తెలిపాడు. గేమ్​ ఉత్కంఠ బరితంగా సాగుతున్నప్పుడు మహీ సలహాలు ఉపయోగపడతాయని, జట్టుపై అతడు ఎంతో ప్రభావం చూపిస్తాడని తెలిపాడు.

"భారత జట్టుకు ధోనీ సేవలు ఎంతో కీలకం. ఎన్నో ఏళ్ల పాటు కీపర్​గా అన్ని ఫార్మాట్లలో రాణించాడు. వన్డేల్లో మహీ అందుకునే క్యాచ్​లు, చేసే రనౌట్​లు, స్టంపింగ్స్​ మ్యాచ్​పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలే విజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ ఐపీఎల్​లో ధోనీ బ్యాటింగ్​లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు" -రవిశాస్త్రి, భారత్ కోచ్​

ఈ ఐపీఎల్​లో ధోనీ 83.2 సగటుతో 416 పరుగులు చేశాడు. చెన్నై సూపర్​ కింగ్స్​​ జట్టు రన్నరప్​గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

ప్రపంచకప్​లో ప్రతీ జట్టుకు విజయావకాశముందని, ఎవర్నీ తక్కువ అంచనా వేయలేమని రవిశాస్త్రి చెప్పాడు. 2014కు ఇప్పటికీ అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్​ జట్లు తమ ఆటలో ఎంతో మెరుగయ్యాయని, మెగాటోర్నీలో పోటీ తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

ఇది చదవండి:'బౌలర్లు సూపర్​ ఫిట్... భారత జట్టు తప్పక హిట్​'

ABOUT THE AUTHOR

...view details