తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2019, 5:57 PM IST

Updated : Jun 16, 2019, 9:07 PM IST

ETV Bharat / sports

భారత్xపాక్: మ్యాచ్​లో తారల సందడి

భారత్- పాక్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్​ అంటే సర్వత్రా క్రేజ్ ఉంటుంది. సాధారణ ప్రజలే కాకుండా ప్రముఖులు ఈ మ్యాచ్​ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మ్యాచ్​లో సెలబ్రెటీల సందడి

నేడు కొంత మంది భారతీయ సినీ ప్రముఖులు మాంచెస్టర్​లో జరుగుతున్న భారత్​-పాక్ మ్యాచ్​కు హాజరై సందడి చేశారు.

వరల్డ్​ కప్​పై సినిమా.. వరల్డ్​ కప్​లో హీరో

ఓపెనర్ శిఖర్ధావన్​తో రణ్​వీర్ సందడి

బాలీవుడ్ నటుడు రణ్​వీర్​ సింగ్​.. గాయంతో ఆటకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్​తో కలిసి భారత్​-పాక్​ మ్యాచ్​లో సందడి చేశాడు. రణ్​వీర్ ప్రస్తుతం భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్​ పాత్రలో '83' అనే సినిమాలో నటిస్తున్నాడు.

మొదటిసారి వరల్డ్ కప్​ సాధించినప్పటి పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రణ్​ వీర్​ ప్రపంచకప్​పై తీస్తున్న సినిమాలో నటిస్తూ... ప్రపంచకప్​ మ్యాచ్​కు హాజరై సందడి చేశాడు.

మ్యాచ్​లో రకుల్​ ప్రీత్​, మంచు లక్ష్మి సందడి

భారత్​-పాక్​ మ్యాచ్​కు రకుల్​ ప్రీత్​ సింగ్​

ప్రముఖ నటి రకుల్​ ప్రీత్​ సింగ్​ భారత్​-పాక్​ మ్యాచ్​కు హాజరైంది. టీమిండియాను ప్రోత్సహిస్తూ మైదానంలో సందడి చేసింది.

జాతీయ జెండా ప్రదర్శిస్తున్నమంచు లక్ష్మి

తెలుగు సినీ నటి, మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి దాయాదులతో పోరు చూసేందుకు మాంచెస్టర్​కు వచ్చారు. భారత్​కు మద్దతుగా జాతీయ జెండా ప్రదర్శిస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ఇండియా జెర్సీతో శివ కార్తికేయన్... అనిరుధ్​

ఇండియా జెర్సీతో శివకార్తికేయన్... అనిరుధ్​ రవిచంద్రన్

తమిళ యువ కథనాయకుడు శివ కార్తికేయన్​.. సంగీత దర్శకుడు అనిరుధ్​ రవిచంద్రన్​ మాంచెస్టర్ మైదానంలో భారత్​కు అనుకూలంగా నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇద్దరూ భారత జెర్సీలు ధరించి మద్దతు ప్రకటించారు.

Last Updated : Jun 16, 2019, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details