టెస్టు క్రికెట్కు కాలం చెల్లిందనే వ్యాఖ్యలపై తాను ఏకీభవించనని టీమిండియా మాజీ సారథి, ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అభిమానులింకా ఈ ఫార్మాట్ను ఆదరిస్తున్నారని, కాకపోతే స్టేడియాల్లో కాకుండా డిజిటల్ మాధ్యమాల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారని చెప్పాడు. ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనపైనా స్పందించాడు. ఐదు రోజులు ఆడితేనే అది టెస్టు అవుతుందని, నాలుగు రోజులనేది ఆట కాదని అన్నాడు కుంబ్లే.
ఐసీసీ నాలుగు రోజుల టెస్టుపై కుంబ్లే ఏమన్నాడంటే? - kumble on test
భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే.. ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు విషయమై మాట్లాడాడు. ఐదు రోజులు ఆడితేనే టెస్టు కింద పరిగణించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంలోనూ దిగ్గజ క్రికెటర్ సచిన్, టీమిండియా సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహా పలువురు మాజీలు ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఐసీసీ నాలుగు రోజుల టెస్టుపై కుంబ్లే ఏమన్నాడంటే..?
2023-2031 సీజన్లో ఐసీసీ.. కచ్చితంగా నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో చాలా మంది మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనిపై కుంబ్లే సారథ్యంలో కమిటీని వేశారు. దుబాయ్ వేదికగా వచ్చే నెలలో ఇందుకు సంబంధించిన సమావేశాలు జరగనున్నాయి. ఇందులో 4 రోజుల టెస్టు ప్రతిపాదనపై కుంబ్లేతోపాటు ఆండ్రూ స్ట్రాస్, రాహుల్ ద్రవిడ్, మహేలా జయవర్ధనే, షాన్ పొలాక్ సహా పలువురు క్రికెటర్లు చర్చించనున్నారు.
Last Updated : Mar 2, 2020, 9:00 PM IST