యువరాజ్ సింగ్.. ఈ పేరు చెప్పగానే ఆరు బంతుల్లో ఆరు కళ్లు చెదిరే సిక్సులు గుర్తుకు వస్తాయి. స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో ఎంతో మంది అభిమానుల్ని సంపాందించిన యువీ.. ఇటీవలే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20లో ఆడుతోన్న ఈ మాజీ టీమిండియా ఆటగాడు మరోసారి బ్యాట్ పవర్ చూపించాడు. తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.
శనివారం ఎడ్మాంటన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందులో ఓ సిక్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.