మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. వాషింగ్టన్లోని క్యాపిటల్ వన్ ఏరియాలో పాక్-అమెరికన్లతో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరై తమ దేశ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ జట్టును తయారు చేస్తున్నామని చెప్పారు.
"వచ్చే ఐసీసీ టోర్నీ కోసం అత్యుత్తమ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాం. నా మాటలు గుర్తు పెట్టుకోండి." -ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధానమంత్రి