ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన మహిళా టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
మిథాలీ లేకుండా.. తొలిసారి
టీ20 ప్రపంచకప్లో తొలిసారి భారత జట్టు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ లేకుండా బరిలోకి దిగుతోంది. 2009లో తొలి ప్రపంచకప్ నుంచి వరుసగా ఆరు టోర్నీల్లోనూ ఆమె బరిలోకి దిగింది. అయితే గత కప్పులో సెమీఫైనల్కు మిథాలీని తుది జట్టులోకి తీసుకోకపోవడం దుమారం రేపింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో మిథాలీ ఉంటే భారత్ గెలిచేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది ఆమె టీ20లకు గుడ్బై చెప్పింది. గత టోర్నీలో సారథిగా వ్యవహరించిన హర్మన్ప్రీతే ఈసారి కూడా జట్టును నడిపించనుంది.
తుది జట్లు