తెలంగాణ

telangana

ETV Bharat / sports

కామన్​వెల్త్​ గేమ్స్​లో టీ-20 క్రికెట్​ - commonwealth games

ఇంగ్లాండ్ బర్మిగ్​హామ్ వేదికగా 2022లో కామన్​వెల్త్​గేమ్స్​ జరగనున్నాయి. ఈ పోటీల్లో మహిళా టీ-20 క్రికెట్​ను చేర్చారు. ఈ విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించింది.

కామన్​వెల్త్​

By

Published : Aug 13, 2019, 2:31 PM IST

Updated : Sep 26, 2019, 9:00 PM IST

కామన్​వెల్త్​ గేమ్స్​లో ఇకపై క్రికెట్ పోటీలను వీక్షించవచ్చు. 2022లో జరిగే బర్మింగ్​హామ్ కామన్​వెల్త్​ క్రీడల్లో మహిళా టీ 20 క్రికెట్​ను చేర్చారు. మొత్తం 8 దేశాలు ఇందులో పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ధ్రువీకరించింది.

మహిళా టీ-20 క్రికెట్​

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో క్రికెట్​ను చేర్చాలని చాలా రోజుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవలే మహిళా టీ-20 పార్మాట్​ను నామినేట్ చేశారు. నేడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

"అంతర్జాతీయ క్రికెట్ సమాజానికి నిజంగా ఇది చారిత్రక సంఘటన. 2022 బర్మింగ్​హామ్​ క్రీడల్లో మహిళా క్రికెట్​ను చేర్చేందుకు ఓట్​ చేసిన కామన్​వెల్త్​ అసొసియేషన్​కు ధన్యవాదాలు" -మను సహానే, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్

టీ-20 ఫార్మాట్​​ను కామన్​వెల్త్​ గేమ్స్​లో నిర్వహించేందుకు సరిగ్గా సరిపోతుందని మను సహానే అభిప్రాయపడ్డారు.

"ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తు క్రికెటర్లకు మంచి అవకాశం కల్పించినట్లయింది. చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. 2022 బర్మింగ్​హామ్​ కామన్​వెల్త్​ గేమ్స్​లో భాగం కావడం నిజంగా మంచి అనుభవంగా మిగులుతుందని ఆశిస్తున్నా" -మను సహానే, ఐసీసీ చీఫ్ ఎగ్జిగ్యూటీవ్

కామన్​వెల్త్​గేమ్స్​లో క్రికెట్​ను తొలిసారిగా 1998లో చేర్చారు. కౌలాలంపూర్​లో జరిగిన ఆ క్రీడల్లో 50 ఓవర్ల ఫార్మాట్​లో పురుషులు ఆడారు. దక్షిణాఫ్రికా జట్టు బంగారు పతకాన్ని గెల్చుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 2022లో టీ-20 ఫార్మాట్​లో మహిళా క్రికెటర్లు పాల్గొననున్నారు.

ఇది చదవండి: 2028 ఒలింపిక్స్​లో క్రికెట్..!​: ఐసీసీ ప్రయత్నాలు

Last Updated : Sep 26, 2019, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details