తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల దేశవాళీ వన్డే టోర్నీ షెడ్యూల్ విడుదల

మహిళల దేశవాళీ వన్డే టోర్నీ మార్చి 11న మొదలుకానుంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్​ను బీసీసీఐ విడుదల చేసింది.

By

Published : Feb 27, 2021, 10:58 AM IST

Women's cricket season to start with 50-over tournament from March 11
మహిళల దేశవాళీ వన్డే టోర్నీ పూర్తి షెడ్యూల్ ఇదే

మార్చి 11 నుంచి 50 ఓవర్ల టోర్నమెంట్​తో మహిళల దేశవాళీ క్రికెట్​ సీజన్​ ప్రారంభంకానుంది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్​ సంఘాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమాచారమిచ్చింది.

సూరత్, రాజ్​ కోట్, జైపుర్, ఇండోర్, చెన్నై, బెంగళూరు వేదికల్లో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. మార్చి 4 కల్లా జట్లు సంబంధిత వేదికలకు చేరుకొని మూడు సార్లు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బీసీసీఐ ఆదేశించింది.

టోర్నమెంట్​లో 5 ఎలైట్​ గ్రూపుల్లో 6 జట్లు, ఒక ప్లేట్​లో 7 జట్లు పాల్గొంటాయి. మార్చి 29న క్వార్టర్ ఫైనల్స్, ఏప్రిల్ 1న సెమీ ఫైనల్స్, ఏప్రిల్ 4న ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది.

ఇదీ చూడండి:'భారత్​కు ఆ అవకాశం ఇస్తే.. ఐసీసీ బలహీనపడినట్లే!'

ABOUT THE AUTHOR

...view details