తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: నిలవాలంటే విండీస్​ గెలవాల్సిందే..

ప్రపంచకప్​లో తాడోపేడో తేల్చుకునేందుకు కరీబియన్ జట్టు సిద్ధమైంది. సెమీస్ రేసులో ఉండాలంటే కివీస్​తో నేడు జరిగే మ్యాచ్​లో గెలవాలి. మాంచెస్టర్ వేదిక. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

By

Published : Jun 22, 2019, 8:01 AM IST

నిలవాలంటే.. విండీస్ గెలిచి తీరాలి

మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్-వెస్టిండీస్ మధ్య నేడు కీలక మ్యాచ్​ జరగనుంది. రేసులో నిలవాలంటే వెస్టిండీస్ తప్పక గెలివాల్సిన పరిస్థితి. వరుస విజయాలు సాధిస్తున్న కివీస్​ను కరీబియన్ జట్టు అడ్డుకుంటుందా అనేదే ప్రశ్న.

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు

తన ఆరంభ మ్యాచ్​లోనే పాకిస్థాన్​పై గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించింది వెస్టిండీస్. తర్వాత ఆడిన అన్నింట్లోనూ ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది హోల్డర్​ సేన. సెమీస్​కు వెళ్లాలంటే ఈ మ్యాచ్​లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. బ్యాటింగ్​లో రాణిస్తున్నా.. బౌలింగ్ వైఫల్యం కరీబియన్ జట్టును వెంటాడుతోంది.

వెస్టిండీస్ జట్టు సభ్యులు

మరోవైపు ఆడిన ఐదింటిలో నాలుగు మ్యాచ్​ల్లో గెలిచింది కివీస్. భారత్​తో మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది విలియమ్సన్ బృందం.

జట్లు(అంచనా)

వెస్టిండీస్: గేల్, డారెన్ బ్రావో, రసెల్, గాబ్రియెల్, హోల్డర్(కెప్టెన్), లూయిస్, కాట్రెల్, పూరన్, హెట్​మయిర్, హోప్, థామస్.

న్యూజిలాండ్:గప్తిల్, విలియమ్సన్, రాస్ టేలర్, గ్రాండ్​హోమ్, మన్రో, బౌల్ట్, లేథమ్, జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, శాంట్నర్, ఫెర్గూసన్.

ఇది చదవండి: క్రికెట్.. కష్టాల్ని ఎదుర్కొవడం నేర్పుతుందంటున్న విరాట్ కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details