ఈ ఏడాది ఐపీఎల్ కోసం దుబాయ్కి చేరుకున్న ఫ్రాంచైజీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకటి. వారం రోజుల క్వారంటైన్ తర్వాత తొలి శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. గత సీజన్తో పోలిస్తే ఈ సారి జట్టులో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మైక్ హెసన్ క్రికెట్ డైరెక్టర్ కాగా.. గ్యారీ కిర్స్టన్ స్థానంలో సైమన్ కటిచ్ను ప్రధాన కోచ్గా నియమించారు. దీంతో పాటు అరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, డేల్ స్టెయిన్ వంటి ఆటగాళ్ల రాకతో.. కొత్తగా కనిపిస్తున్న ఆర్సీబీ సైన్యంపై అభిమానుల అంచనాలు పెరిగిపోతున్నాయి.
అయితే, ఈ సీజన్లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఓపెనర్గా దిగే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెసన్ స్పందిస్తూ.. దీనిపై జట్టు ఎప్పుడూ చర్చించలేదని స్పష్టం చేశాడు.