ఐపీఎల్లో ఆడటం చాలా బాగుంటుందని సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. అయితే, ఈ ఏడాది టోర్నమెంట్ నిర్వహణ కోసం మరిన్ని ప్రణాళికలు, కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించాడు.
"ఐపీఎల్లో ఆడటం అంటే ఎప్పటికీ అద్భుతమైన విషయమే. కచ్చితంగా అందులో ఆడటం, లీగ్లో భాగం కావడం నాకెంతో ఇష్టం. అయితే, తుది నిర్ణయాలు తీసుకునే ముందు చాలా వివరాలు తెలియాల్సి ఉంది. టీ20 వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఐపీఎల్ నిర్వహించాల్సిన అవసరం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆటగాళ్లతో మాట్లాడే ముందు అధికారులు అన్ని ప్రణాళికలపై ఓ స్పష్టత తెచ్చుకుంటారని నా అభిప్రాయం."