తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​కు షాక్​.. రెండో టీ20లో కరీబియన్ల విధ్వంసం - west indies - india 2019

తిరువనంతపురం వేదికగా భారత్​తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్​ల సిరీస్​ 1-1 సమమైంది. బుధవారం జరిగే నిర్ణయాత్మక మూడో టీ20లో ఫలితం తేలనుంది.

widies won the second t20 match
భారత్​కు షాక్​.. రెండో టీ20లో కరీబియన్ల విధ్వంసం

By

Published : Dec 8, 2019, 11:33 PM IST

Updated : Dec 8, 2019, 11:58 PM IST

వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు వెస్టిండీస్ షాకిచ్చింది. తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 15 బంతులు మిగిలుండగానే పూర్తి చేశారు కరీబియన్ బ్యాట్స్​మెన్. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్(67) అర్ధశతకంతో రాణించగా.. మిగతా బ్యాట్స్​మెన్ తలో చేయి వేసి జట్టుకు విజయాన్నందించారు. భారత బౌలర్లలో జడేజా, సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.

లక్ష్య ఛేదనలో విండీస్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు సిమ్మన్స్, లూయిస్(40) తొలి వికెట్​కు 73 పరుగులు జోడించారు. లూయిస్​ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్మైర్(23) బౌలర్లపై ప్రతి దాడికి దిగాడు. జడ్డూ బౌలింగ్​లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి భారత అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించాడు.

కోహ్లీ కిర్రాక్ క్యాచ్​..

తర్వాత బంతిని కూడా లాంగాన్​ దిశగా హిట్మైర్ భారీ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్​లో విరాట్ కోహ్లీ అద్భత క్యాచ్​తో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. హిట్మైర్ ఔటైనప్పటికీ నికోలస్ పూరన్(38) - సిమ్మన్స్ జోడీ దూకుడు తగ్గించలేదు. ఓవర్​కు సిక్సర్, ఫోర్ చొప్పున మ్యాచ్​ను ముందుగానే ముగించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియాలో.. యువ బ్యాట్స్​మన్ శివమ్ దూబే(54) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రిషభ్ పంత్(33) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో విలియమ్స్, హేడెన్ వాల్ష్ చెరో 2 వికెట్లతో రాణించగా.. పియర్రే, జేసన్ హోల్డర్, కాట్రెల్ తలో వికెట్ తీశారు.

ఇదీ చదవండి: దంచి కొట్టిన దూబే.. భారత్​ స్కోరు 170/7

Last Updated : Dec 8, 2019, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details