తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీతో నన్నెందుకు పోలుస్తున్నారు: బాబర్​

భారత క్రికెటర్లతో తనను పోల్చడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు పాకిస్థాన్​ పరిమిత ఓవర్ల కెప్టెన్​ బాబర్​ అజామ్. వారితో కాకుండా పాకిస్థాన్​ దిగ్గజ ఆటగాళ్లతో పోలిస్తే ఎంతో సంతోషిస్తానని తెలిపాడు.

By

Published : Jul 3, 2020, 12:07 PM IST

Why compare me with Kohli or any other Indian player? Asks Babar
కోహ్లీతో నన్నెందుకు పోలుస్తున్నారు: బాబర్​

కోహ్లీతో తనను పోలుస్తున్నందుకు విసిగెత్తి పోయానని పాకిస్థాన్​ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్​ బాబర్​ అజామ్​ అన్నాడు. పాక్​లో ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లుండగా తనను భారత క్రికెటర్లతో పోల్చడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​ పర్యటనలో జట్టుతో ఉన్న ఈ క్రికెటర్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించాడు.

"వాళ్లకంటే (భారత క్రికెటర్లు) పాక్ దిగ్గజ ఆటగాళ్లు జావెద్​ మియాందాద్​, మహ్మద్​ యూసఫ్​ లేదా యూనిస్​ ఖాన్​తో పోల్చినా సంతోషపడే వాడ్ని. కోహ్లీ లేదా ఇతర భారత ఆటగాళ్లతో నన్ను ఎందుకు పోలుస్తున్నారు".

- బాబర్​ అజామ్​, పాకిస్థాన్​ కెప్టెన్​

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో 70 సెంచరీలను తన పేరు మీద లిఖించుకున్నాడు. పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ పరిమిత ఓవర్ల ఫార్మట్లలో 50కి పైగా సగటుతో 16 శతకాలు చేశాడు. 26 టెస్టుల్లో 45.12 సగటుతో 1,850 పరుగులు సాధించాడు.

వచ్చే నెలలో ఇంగ్లాండ్​తో జరిగే సిరీస్​లో తాను ఏ బౌలర్​ను టార్గెట్​ చేయడం లేదని బాబర్​ అజామ్​ స్పష్టం చేశాడు. కొంతమంది అనుభవుజ్ఞులైన క్రికెటర్లు ఇంగ్లాండ్​ సిరీస్​కు దూరమైనా.. ప్రస్తుతం ఉన్న బౌలర్లు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలరని ఆశిస్తున్నానని తెలిపాడు.

ఇదీ చూడండి... ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్​కు కరోనా!

ABOUT THE AUTHOR

...view details