టీమ్ఇండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు బ్యాటింగ్లో ఎవరికి వారే సాటి. వీరిద్దరూ బరిలో దిగితే ప్రత్యర్థి జట్టులో కలవరం మొదలవడం ఖాయం. అలాంటి పరిస్థితే ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్కు ఎదురైంది. జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన వన్డేలో కోహ్లీ, రోహిత్ విజయవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వీరిని ఔట్ చేసేందుకు సలహ ఇవ్వమని, ఆ మ్యాచ్లో అంపైరింగ్ చేస్తున్న మైకేల్ గాఫ్ను కోరాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు గాఫ్.
"భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పడం ఇంకా గుర్తుంది. స్క్వేర్ లెగ్లో నిల్చొని అంపైరింగ్ చేస్తున్నాను. నా పక్కనే ఉన్న ఫించ్.. వారిద్దరిని ఔట్ చేయడం ఎలా? అని నన్ను అడిగాడు. 'నాకు చేతి నిండా పనుంది. నీ పని నీకుంది' అని నేను జవాబిచ్చాను"