తమ జట్టు పేస్ బౌలింగ్కు ప్రపంచంలోని ఏ జట్టునైనా ఎదుర్కోగల సామర్థ్యం ఉందని ధీమా వ్యక్తం చేశాడు వెస్టిండీస్ సహాయ కోచ్ రోడీ ఎస్ట్విక్. ఈ లాక్డౌన్ సమయంలో బౌలర్లు ఫిట్నెస్ను మరింత పెంచుకున్నారని అన్నాడు. జూన్ 8న ఇంగ్లాండ్తో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్లో తమ సత్తా చూపిస్తారని వెల్లడించాడు.
కీమర్ రోచ్, గ్యాబ్రియల్, అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారని.. ఈ లాక్డౌన్ సమయంలో వారు మరింత రాటుదేలారని రోడీ తెలిపాడు. 1970, 80 కాలం నాటి జట్టు పేస్ సామర్థ్యాలను వీరు కూడగట్టుకున్నారని అన్నాడు. అండర్సన్, ఫిలిప్ కూడా బలమైన బౌలర్లగా రూపుదిద్దుకున్నారని వెల్లడించాడు.