తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో సిరీస్​కు విండీస్​​ జట్టు ప్రకటన - వెస్టిండీస్ జట్టు ప్రకటన

టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న జట్టును ప్రకటించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. రెండు ఫార్మాట్లలో కీరన్ పొలర్డ్​కే సారథ్య బాధ్యతలు అప్పగించింది.

West Indies name ODI and T20 squad for India tour
భారత్​తో సిరీస్​ జట్టును ప్రకటించిన విండీస్

By

Published : Nov 29, 2019, 12:05 AM IST

డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్​లో పర్యటించనుంది. ఈ నేపథ్యలో వన్డే, టీ20 సిరీస్​కు జట్లను ప్రకటించింది కరీబియన్ బోర్డు. రెండు సిరీస్​లకూ కీరన్ పొలార్డే సారథ్యం వహించనున్నాడు. పొట్టి ఫార్మాట్లో నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్​గా వ్యవహరించనుండగా.. వన్డేల్లో షాయ్ హోప్ ఆ బాధ్యతలు నిర్వహించనున్నాడు.

ఇటీవల అఫ్గాస్థాన్​తో జరిగిన సిరీస్​లో విండీస్ పరాజయం చెందినప్పటికీ మళ్లీ అదే జట్టుపై నమ్మకముంచింది కరీబియన్ క్రికెట్ బోర్డు. అఫ్గాన్​తో సిరీస్​లో ఆడిన వారికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది.

వెస్టిండీస్ వన్డే జట్టు:

సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, ఖేరీ పియర్రే, రోస్టన్​ ఛేజ్, అల్జారీ జోసెఫ్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), షెల్డన్ కాట్రెల్, బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్, షిమ్రన్ హిట్మైర్, ఎవిన్ లూయిస్, షెఫెర్డ్, జేసన్ హోల్డర్, కీమో పాల్, హెడెన్ వాల్ష్ జూనియర్.

వెస్టిండీస్ టీ20 జట్టు:

ఫాబియన్ అలెన్, బ్రెండన్ కింగ్, దినేశ్ రామ్​దిన్, షెల్డన్ కాట్రెల్, ఎవిన్ లూయిస్, రూథర్​ఫర్డ్, షిమ్రన్ హిట్మైర్, ఖేరీ పియర్రే, సిమ్మన్స్, జేసన్ హోల్డర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), హెడెన్ వాల్ష్ జూనియర్, కీమో పాల్, నికోలస్ పూరన్, కెర్సిక్ విలియమ్స్​

డిసెంబరు 6న ప్రారంభం కానున్న తొలి మ్యాచ్​ హైదరాబాద్​లో నిర్వహించనుండగా.. రెండో టీ20.. 8న కేరళ తిరువనంతపురంలో జరగనుంది. డిసెంబరు 11న జరగనున్న చివరి టీ20కి ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది.

ఇదీ చదవండి: తొలి టీ20 హైదరాబాద్​లో.. చివరిది ముంబయిలో

ABOUT THE AUTHOR

...view details