తెలంగాణ

telangana

By

Published : May 31, 2019, 1:18 PM IST

ETV Bharat / sports

'ఈ ఓటమి నుంచి త్వరగా బయటపడతాం'

ఇంగ్లండ్​ చేతిలో ఓటమి నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. తర్వాతి మ్యాచుల్లో మెరుగ్గా రాణిస్తామని అన్నాడు.

'ఈ ఓటమి నుంచి తర్వగా బయటపడతాం'

ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లో ఇంగ్లండ్​ చేతిలో 104 పరుగుల తేడాతో ఓటమి పాలైంది దక్షిణాఫ్రికా. ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తామని చెపుతున్నాడు సఫారీ కెప్టెన్ డుప్లెసిస్. అన్ని విభాగాల్లోనూ అనుకున్నంత మేర రాణించలేకపోయామని చెప్పాడీ బ్యాట్స్​మెన్.

"కొన్నిసార్లు ప్రత్యర్థులు మనకంటే బాగా ఆడతారు. ఈ మ్యాచ్​లో సమష్టిగా రాణించి విజయం దక్కించుకుంది ఇంగ్లండ్. ఈ ఓటమి నుంచి మేం త్వరగా బయటపడతాం. తర్వాతి మ్యాచ్​ల్లో మెరుగ్గా ఆడతాం." -డుప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్

ఇంగ్లండ్​తో మ్యాచ్​లో ఇన్నింగ్స్ తొలి ఓవర్​ను తాహిర్​తో వేయించడంపైనా స్పందించాడు కెప్టెన్ డుప్లెసిస్.

జట్టు సభ్యులతో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్

"ఇదంతా ప్రణాళికలో భాగమే. సంవత్సరం క్రితమే ఈ ఆలోచన చేశాం. ఇంగ్లండ్​తో ఆడేటపుడు తాహిర్​తో బౌలింగ్​ ప్రారంభించాలనుకున్నాం. ఇది ప్రత్యేకమైన అంశం" -డుప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్

ఆదివారం ఓవల్ వేదికగా జరిగే తన తర్వాతి మ్యాచ్​లో బంగ్లాదేశ్​తో తలపడనుంది సఫారీ జట్టు.

ఇది చదవండి: ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై ఆతిధ్య ఇంగ్లండ్ విజయం

ABOUT THE AUTHOR

...view details