తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 1:05 PM IST

Updated : Jul 24, 2020, 2:15 PM IST

ETV Bharat / sports

ఊహాగానాలకు చెక్.. సెప్టెంబరు నుంచే ఐపీఎల్​

ఊహాగానాలకు చెక్ పెడుతూ సెప్టెంబరు- నవంబరు మధ్యే ఐపీఎల్​ జరగనుందని ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. త్వరలో పూర్తి షెడ్యూల్​ ప్రకటిస్తామని చెప్పారు.

We have locked Sep 19-Nov 8 window for IPL 13: Chairman Brijesh Patel
సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్​.. బ్రిజేశ్​ పటేల్​ ప్రకటన

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ప్రారంభ తేదీ ఖరారైంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా లీగ్‌ జరగనుందని ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​ అధికారికంగా వెల్లడించారు. ఫైనల్‌ నవంబరు 8న ఉంటుందని, ఆగస్టు 20 కల్లా అన్ని ప్రాంఛైజీలు యూఏఈకి చేరుకుంటాయని తెలిపారు. త్వరలోనే బీసీసీఐ పాలకమండలి​ సమావేశం తర్వాత.. ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్​ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​

"దీనిపై త్వరలోనే సమావేశం జరగనుంది. అదే రోజున ఐపీఎల్​ ప్రణాళికను సిద్ధం చేయనున్నాం. టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 మధ్య జరగుతుంది. దీనికి ప్రభుత్వ అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈసారి ఐపీఎల్‌ 51 రోజుల పాటు సాగనుంది"

బ్రిజేశ్​​ పటేల్​, ఐపీఎల్ ఛైర్మన్​

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్​ ఇప్పటికే యిదా పడింది. దీంతో ఐపీఎల్​ నిర్వహించడానికి బీసీసీఐకి మార్గం సుగమమైంది. కానీ, ఇదే కారణం వల్ల టోర్నీని భారత్​లో నిర్వహించలేక.. యుఏఈలో నిర్వహించనున్నట్లు బ్రిజేష్​ పటేల్​ తెలిపాడు.

Last Updated : Jul 24, 2020, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details