క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ తేదీ ఖరారైంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా లీగ్ జరగనుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఫైనల్ నవంబరు 8న ఉంటుందని, ఆగస్టు 20 కల్లా అన్ని ప్రాంఛైజీలు యూఏఈకి చేరుకుంటాయని తెలిపారు. త్వరలోనే బీసీసీఐ పాలకమండలి సమావేశం తర్వాత.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
"దీనిపై త్వరలోనే సమావేశం జరగనుంది. అదే రోజున ఐపీఎల్ ప్రణాళికను సిద్ధం చేయనున్నాం. టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 మధ్య జరగుతుంది. దీనికి ప్రభుత్వ అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈసారి ఐపీఎల్ 51 రోజుల పాటు సాగనుంది"