తెలంగాణ

telangana

By

Published : Feb 5, 2021, 8:29 PM IST

ETV Bharat / sports

'ఆ స్కోరు చేయడమే మా మొదటి లక్ష్యం'

టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలిటెస్టు రెండో రోజు ఆట కోసం ఎదురుచూస్తున్నట్లు ఇంగ్లాండ్​ సారథి జో రూట్ తెలిపాడు​. తొలి ఇన్నింగ్స్​లో తమ జట్టు 700 పరుగులు చేయడమే లక్ష్యమని అన్నాడు. తాను శతకం బాదటంపై హర్షం వ్యక్తం చేసిన అతడు.. భవిష్యతులో మరిన్ని సెంచరీలు చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

root
రూట్​

టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అయితే తొలి ఇన్నింగ్స్​లో భారీ స్కోరు 600-700 చేయడమే తమ లక్ష్యమని చెప్పాడు ఇంగ్లాండ్ సారథి జో రూట్​. ఇప్పటికే 128 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు రెండో రోజు(శనివారం) ఆటలో భారీ స్కోరు చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

ఇటీవల శ్రీలంకతో సిరీస్​ ఆడి వచ్చింది ఇంగ్లాండ్​. అయితే అక్కడి పిచ్​ పరిస్థితులతో ఇక్కడి వాటిని పోల్చలేమని అన్నాడు రూట్. ఇక్కడి పిచ్​పై స్పిన్​, రివర్స్​ స్వింగ్​, బౌన్స్​ ఎక్కువగా అవుతాయని చెప్పాడు. ఈ పర్యటన పెద్ద సవాలు లాంటిదని వెల్లడించాడు.

ఈ మ్యాచు రూట్​కు 100వ టెస్టు. ఈ పోరులో శతకం(128) బాదటం ఎంతో సంతోషంగా ఉందన్నాడు రూట్​. ఇది తనకెంతో ప్రత్యేకమైనదని చెప్పాడు. భవిష్యతులో మరిన్ని శతకాలు సాధించి.. తమ జట్టును విజయం వైపు నడిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో​ డొమినిక్​ సిబ్లే 87 పరుగులు చేయడంపై​ ప్రశంసలు కురిపించాడు. అతడు మంచి ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు.

ఇదీ చూడండి:100వ టెస్టులో రూట్ @100

ABOUT THE AUTHOR

...view details