సొంతగడ్డపై గత భారత సిరీస్తో పోలిస్తే ప్రస్తుత ఆస్ట్రేలియా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ అన్నాడు. 2018 సిరీస్లో టీమ్ఇండియా చేతిలో కంగారూలు 1-2తో ఓడిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ అతనిలా అన్నాడు.
"భారత్తో రెండేళ్ల క్రితం ఆడిన సిరీస్లో ఏం జరిగిందో ప్రత్యర్థి ఎంతబాగా ఆడిందో అందరికి తెలుసు. కానీ ఈసారి టెస్టు సిరీస్లో భిన్నమైన ప్రణాళికలతో బరిలో దిగుతున్నాం. ఆసీస్ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. గత సిరీస్తో పోలిస్తే మా జట్టు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. నేను ఆడిన ఆసీస్ జట్లలోకెల్లా ఇదే బలమైందని భావిస్తున్నా. గాయం కారణంగా వార్నర్ లాంటి నాణ్యమైన ఆటగాడిని కోల్పోయినా.. టీమ్ఇండియాపై సత్తా చాటేందుకు గట్టిగా కసరత్తులు చేశాం" అని లైయన్ చెప్పాడు.